గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: శుక్రవారం, 30 అక్టోబరు 2020 (19:42 IST)

చేనుకు చేపల చెరువుకి తేడా తెలీని లోకేష్: హహ్హహ్హ్హ అంటూ కొడాలి నాని

నారా లోకేశ్ పైన కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేశ్‌కు వరి చేనుకు, చేపల చెరువుకు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. సీఎంపై ఇష్టం వచ్చినట్లు వాగితే తగిన బుద్ధి చెప్తామని అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కరెంటు చార్జీలు తగ్గించమంటే రైతులపై పోలీసులతో కాల్పులు జరిపించారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
 
ఇప్పుడు సంకెళ్లు వేశారని దేవినేని ఉమ నాటకం ఆడుతున్నారని తెలిపారు. గుంటూరులో జరిగిన ఘటనలో రైతులు పోలీసు సిబ్బంది మీద తిరగబడితే సంకెళ్లు వేశామని తెలిపారు. వారిపై ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది.
 
అమరావతిలో మాత్రమే రైతులున్నట్లు బాబు వ్యవహరిస్తున్నారు. అమరావతిలో కొన్ని భూముల ధరలు పడిపోయాయని రైతులను అడ్డం పెట్టుకొని చంద్రబాబు బృందం నాటకమాడుతుందని ఆరోపించారు.