1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 9 మే 2020 (20:04 IST)

ఎల్‌జి పాలిమర్స్ బాధితుల పరామర్శించిన టీడీపీ త్రిసభ్య కమిటీ

టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబునాయుడు ఆదేశాలు మేరకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయటం జరిగింది.

ఇటీవలే విశాఖపట్నం జిల్లాలో ఆర్.ఆర్ వెంకటపురంలో జరిగిన ఎల్‌జి పాలిమర్స్ బాధితులను ఈరోజు టీడీపీ త్రిసభ్య కమిటీ సభ్యులు టెక్కలి నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు పొలిట్ బ్యూరో సభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి వర్యులు నిమ్మకాయల చినరాజప్ప, శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు ఈరోజు పరామర్శించి తదుపరి మీడియా సమావేశంలో పాల్గొన్నారు.