1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. 10th Class Results to release Tomorrow in Andhra Pradesh

ఏపీలో శనివారం వెల్లడికానున్న టెన్త్ పరీక్షా ఫలితాలు

10th Class Results
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను శనివారం ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ విడుదల చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానంద్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 
 
ఈ పరీక్షలకు సమారు 6 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. గతంలో మాదిరిగానే ఈ సారీ విద్యార్థులకు వచ్చిన మార్కులనే వెల్లడిస్తారు. అలాగే, గ్రేడింగ్ విధానాన్ని తీసివేసారు. అదేవిధంగా విద్యాశాఖ ర్యాంకులను కూడా ప్రకటించదు. ఈ నేపథ్యంలో విద్యా సంస్థలకు కూడా తమ దగ్గర చదువుకున్న విద్యార్థులకు ఫలానా ర్యాంకులు వచ్చాయని ప్రచారం చేయకూడదు. అలా చేస్తే మాత్రం మూడేళ్ళ కఠిన కారాగార శిక్ష పడేలా చేస్తారు. 
తర్వాతి కథనం
నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ