సంబంధిత వార్తలు
- ఏరోస్పేస్, విమానయాన తయారీ యూనిట్లకు కేంద్రంగా సత్యసాయి జిల్లా
- నడక కూడా సాధ్యం కాని చోట్ల సైకిల్ తొక్కుతూ సీమ సాయి అదుర్స్
- జగనన్న ప్రభుత్వం వస్తే రప్పా రప్పా నరికేస్తాం.. ఇంటి పునాదులు కూడా లేకుండా పెకలిస్తాం...
- భార్యను లేపుకెళ్లిన వ్యక్తిని పోలీసు స్టేషను ఎదుటే నరికి చంపారు
- నాలుగేళ్ల బాలుడు కిడ్నాప్ అయ్యాడు.. ఆపై హత్యకు గురయ్యాడు...
జేఈఈ మెయిన్ 2026 సెషన్-1 ఫలితాలు.. ముగ్గురు అనంతపూర్ విద్యార్థులకు ర్యాంక్
ఈ సంవత్సరం జేఈఈ మెయిన్ 2026 సెషన్-1లో చాలా మంది గ్రామీణ విద్యార్థులు రాణించారని వదాన్య ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అశోక్ పడపాటి అన్నారు. ముఖ్యంగా, జేఈఈలో 99.98 శాతంతో జుగేష్ కుమార్, 99.84 శాతంతో తులసి కార్తీక్, 99.78 శాతంతో యెశ్వంత్ కుమార్ అనే ముగ్గురు విద్యార్థులను గురించి ప్రస్తావించారు.
ఈ ముగ్గురూ సత్యసాయి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి వరకు చదువుకున్నారు. తరువాత వారికి వదాన్య ఫౌండేషన్ శిక్షణ ఇచ్చింది. ఈ సంవత్సరం జేఈఈ మెయిన్ సెషన్-1 కి దాదాపు 13 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారని అశోక్ పడపాటి పేర్కొన్నారు.
ఇంత పెద్ద పోటీలో, గ్రామీణ నేపథ్యం ఉన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మంచి స్కోర్లు సాధించడం నిజంగా ప్రోత్సాహకరంగా ఉంది. ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వారి పనితీరు మనోధైర్యాన్ని పెంచుతుందని, సరైన మద్దతు, నిరంతర కృషితో వారు అత్యుత్తమ ఫలితాలను సాధించగలరని ఆయన అన్నారు. నిరంతర మద్దతు ఇచ్చినందుకు వదాన ఫౌండేషన్ అన్ని స్వచ్ఛంద సేవకులు, దాతలకు కృతజ్ఞతలు తెలిపింది.
