ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 26 జూన్ 2024 (23:43 IST)

ఘాట్ రోడ్డులో మహిళను చంపేసిన చిరుతపులి, అటవీశాఖ మంత్రీ పవన్ కాపాడండీ (video)

leopard
నంద్యాల లోని గిద్దలూరులో దారుణం జరిగింది. కట్టెలు తెచ్చుకునేందుకు ఘాట్ రోడ్డుకి సమీపంలో వున్న వంక వద్దకు వెళ్లిన మెహరున్నీసా అనే మహిళపై చిరుతపులి దాడి చేసింది. ఈ దాడిలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
 
గత కొన్నిరోజులుగా తమ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఐతే చిరుత జాడ కోసం అధికారులు గాలిస్తున్న సమయంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకున్నది. కాగా మెహరున్నీసా గతంలో సర్పంచ్‌గా పనిచేసారు.