శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (09:03 IST)

చేదులో తీపి : మద్యంబాబులకు శుభవార్త - ధరలు తగ్గించిన ఏపీ!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మద్యంబాబులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. తాజాగా మద్యం ధరలను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. క్వార్టర్ మద్యం విలువ రూ.150 కంటే తక్కువ ఉన్న బ్రాండ్లపై ధరను రూ.30 వరకు తగ్గించింది. 
 
అన్ని రకాల బీర్లు, రెడీ టు డ్రింక్ మద్యంపై రూ.30 తగ్గిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. రూ.150 నుంచి రూ.190 వరకు క్వార్టర్ ధర ఉన్న మద్యం రేటును యధాతథంగా ఉంచింది. అంతకంటే ఎక్కువ ధర ఉన్న మద్యంపై భారీ ఎత్తున రేట్లను పెంచింది. ఈ పెరుగుదల కనిష్టంగా 40 రూపాయల నుంచి గరిష్టంగా 1320 రూపాయల వరకు ఉంది. ఈ సవరించిన ధరలు గురువారం నుంచే అమల్లోకి వచ్చాయి. 
 
వాస్తానికి కరోనా లాక్డౌన్ తర్వాత ఏపీలో మద్యం ధరలను విపరీతంగా పెంచేశారు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా ఊపందుకుంది. ఈ అక్రమ రవాణాను అరికట్టేందుకు తక్కువ ధర ఉన్న మద్యం రేటును తగ్గించాలంటూ ప్రభుత్వానికి స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో నివేదికను అందించింది. 
 
ఈ నివేదిక ఆధారంగా ధరలను ప్రభుత్వం సవరించింది. మద్యం ధరలను భరించలేక పలు చోట్ల పేదలు శానిటైజర్లు తాగి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలను కూడా పరిగణనలోకి తీసుకున్న ఎస్ఈబీ ప్రభుత్వాన్ని తన నివేదికను అందించింది. ఈ నివేదిక ప్రకారం మద్యం ధరలను ఏపీ సర్కారు తగ్గించింది.