సంబంధిత వార్తలు
- విశాఖపట్నం- విజయవాడలకు కొత్త విమాన సేవలు... ఆదివారాల్లో?
- మరో పది విమానాలకు బాంబు బెదిరింపులు...
- ఎయిర్ఇండియా విమానానికి బెదిరింపులు, బ్రిటన్ ఫైటర్ జెట్స్ తోడు రాగా లండన్లో ప్రయారిటీ ల్యాండింగ్
- తిరుమలలో భారీ వర్షాలు-ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు (video)
- న్యూయార్క్ వెళ్లాల్సిన విమానం ఢిల్లీలో ఆగింది.. ఎందుకని? (video)
విజయవాడ - విశాఖ మధ్య మరో రెండు విమాన సర్వీసులు
విజయవాడ - విశాఖపట్టణం ప్రాంతాల మధ్య కొత్తగా మరో రెండు విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. విశాఖ విమానాశ్రయంలో ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు.
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సర్వీసు ఉదయం 9:35 గంటలకు విశాఖలో బయలుదేరి 10:35కు విజయవాడ (గన్నవరం విమానాశ్రయం) చేరుతుంది. తిరిగి రాత్రి 7:55కు విజయవాడలో బయలుదేరి 9 గంటలకు విశాఖ చేరుతుంది.
అలాగే, ఇండిగో విమాన సర్వీసు రాత్రి 7:15కు విజయవాడలో బయలుదేరి 8:20కి విశాఖ చేరుతుంది. అదే సర్వీసు తిరిగి రాత్రి 8:45కు విశాఖలో బయలుదేరి 9:50కి విజయవాడ చేరుతుంది. ఈ కొత్త విమానాలతో కలిపి విశాఖ - విజయవాడ మధ్య తిరిగే సర్వీసుల సంఖ్య మూడుకు చేరనుంది.
