ఇప్పుడే మోడీ గారికి ఫోన్ కలపమన్నా... సీఎం బాబు, ఎమ్మెల్యే రోజా కామెంట్స్....  
                                          ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సంభాషించడం, అంతకుముందు 29 సార్లు ఢిల్లీకి వెళ్లినా మోదీ అపాయిట్మెంట్ దొరకలేదని చెప్పడంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శనాస్త్రాలు సంధించారు. ఆమె మాట్లాడుతూ.. ''ఆంధ్రప్రదేశ్ ప్రజలారా... కొం
                                       
                  
                  				  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సంభాషించడం, అంతకుముందు 29 సార్లు ఢిల్లీకి వెళ్లినా మోదీ అపాయిట్మెంట్ దొరకలేదని చెప్పడంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శనాస్త్రాలు సంధించారు. ఆమె మాట్లాడుతూ.. ''ఆంధ్రప్రదేశ్ ప్రజలారా... కొంచెం కళ్ళు తెరవండి. 
	 
				  											
																													
									  
	మరీ ఎంత వెర్రి పప్పలను చేస్తున్నారో చూడండి. మనం తెలుగు వారిమా... లేక పక్క రాష్ట్రం నుంచి వలస వచ్చిన పరాయి భాష వారిమా. మొన్నేమో డిల్లీకి 29 సార్లు వెళ్ళాను ఒక్కసారి కూడా 
				  
	ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పారు. ఇప్పుడు పోన్లో లైన్ కలపమంటే వెంటనే ప్రధాని మంత్రి ఫోన్ లైనులోకి రావటం. 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	అసలు మన ఆంద్రప్రదేశ్ ప్రజలకు కనపడదూ వినపడదూ అని  జమ కడుతున్నారా
	ఆలోచించండి సోదర సోదరీమణులారా?" అంటూ చెప్పుకొచ్చారు.