1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. AP CM Sameer Sharma Service Extended to November 30

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవీకాలం పొడగింపు

sameer sharma
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పదవీకాలాన్ని ఆర్నెల్లపాటు పొడగిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన గతంలో కేంద్రానికి లేఖ రాశారు. ఏపీ సీఎస్‌‍గా ఉన్న సమీర్ శర్మ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. 
 
దీంతో ఆయన పదవీకాలాన్ని మరో ఆర్నెల్లపాటు పొడగించాలని కోరుతూ సీఎం జగన్ లేఖ రాశారు. జగన్ రాసిన లేఖకు కేంద్రం సమ్మతం తెలిపుతూ సమీర్ శర్మ సర్వీసును నవంబరు 30వ తేదీ వరకు పొడగించింది. ఈ మేరకు డీవోపీటీ ఉత్తర్వులు జారీచేసింది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
14న తెలంగాణా పర్యటనకు వస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా