1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 మే 2021 (09:28 IST)

తల్లిదండ్రులులేని పిల్లలకు ఆసరా... రూ.10 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కష్టకాలంలో కరోనా వైరస్ సోకి తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల పేరిట రూ.10 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. 
 
మరోవైపు, ఇంటింటికీ వెళ్లి నిర్వహిస్తున్న ఫీవర్‌ సర్వేలో లక్షణాలు గుర్తించిన వారికి పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పరీక్షల్లో వైరస్‌ ఉందని తేలిన వారికి తగిన వైద్య సదుపాయాలు కల్పించడంతోపాటు మందులు కూడా అందించాలన్నారు. కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో సదుపాయాలపై దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో కల్పించాలని సూచించారు.
 
ముఖ్యంగా, గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్‌ కేసులు పెరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వలంటీర్లు, ఆశావర్కర్లు, సచివాలయాల వ్యవస్థను సమర్థంగా  వినియోగించుకోవాలని సూచించారు.