1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 18 జూన్ 2024 (11:43 IST)

పసుపు బిళ్ళ పెట్టుకుని వెళ్లండి.. టీ ఇచ్చి కుర్చీవేసి పని చేసిపెడతారు.. మంత్రి అచ్చెన్నాయుడు

atchannaidu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కీలక సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్లు, ఎమ్మార్వో, ఎండీవో కార్యాలయాలకు వెళ్లే టీడీపీ కార్యకర్తలు పసుపు బిళ్లతో వెళ్లాలని, అపుడు అధికారులో మీకు టీలు ఇచ్చి, కుర్చీలు వేసిమరీ పనలు చేసిపెడతారంటూ సూచించారు. పైగా, తాను చెప్పినట్టు అధికారులు వినకపోతే ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్పను, చేతల్లో చూపిస్తాను అని పరోక్షంగా అధికారులను సైతం హెచ్చరించారు. 
 
గత ఐదేళ్ల వైకాపా ప్రభుత్వం టీడీపీ కార్యకర్తలను ప్రభుత్వం అధికారులు, పోలీసులు నానా రకాలుగా వేధించారు. వారికి నరకం చూపించారు. వైకాపా నేతల దాడిలో గాయపడి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళితే బాధితులపైనే కేసులు పెట్టారు. పోలీసులు అయితే మరింతగా చెలరేగిపోయారు. వైకాపా నేతలు చెప్పినట్టుగా నడుచుకున్నారు. టీడీపీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులు చేసి, వారిపైనే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు పెట్టారు. ఇపుడు అధికారం మారిపోయింది. వైకాపా స్థానంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో గత ఐదేళ్లుగా టీడీపీ కార్యకర్తలను వేధించిన పోలీసులు, అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.