1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. B.Tech Students suicide in Prakasam

బాయ్‌ఫ్రెండ్‌కు వీడియో కాల్ చేసి ఉరేసుకున్న బీటెక్ విద్యార్థిని

ప్రకాశం జిల్లాలో విషాదం జరిగింది. బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తన బాయ్ ఫ్రెండ్‌కు వీడియో కాల్ చేసి, ఎంబీఏ చదువుతున్న విద్యార్థిని హనీషా చౌదరి కాలేజీ హాస్టల్‌లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని మరణించి

Prakasam
ప్రకాశం జిల్లాలో విషాదం జరిగింది. బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తన బాయ్ ఫ్రెండ్‌కు వీడియో కాల్ చేసి, ఎంబీఏ చదువుతున్న విద్యార్థిని హనీషా చౌదరి కాలేజీ హాస్టల్‌లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని మరణించిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, అనంతపురం జిల్లాకు చెందిన హనీషా అనే యువతి కొంపల్లిలోని శివశివానీ కాలేజీలో ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతోంది. ఈమె దక్షిణ్ పటేల్ అనే యువకుడిని ఆమె ప్రేమించింది. 
 
అయితే, వారిమధ్య ఏం జరిగిందో ఏమో తెలియదుకానీ, ప్రియుడికి వీడియో కాల్ చేసింది. ప్రియుడు వీడియో చూస్తుండగానే ఆ యువతి ఉరేసుకుంది. వెంటనే అతను హాస్టల్‌కు చేరుకుని, విషయం చెప్పి తలుపులను బద్దలు కొట్టి చూడగా, ఆమె అపస్మారక స్థితిలో కనిపించింది. 
 
ఆమె ఫ్రెండ్స్ సాయంతో సిగ్మా ఆసుపత్రికి తరలిస్తుండగా, ఈలోగానే ప్రాణాలు కోల్పోయింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు, అనంతపురంలో ఉన్న తల్లిదండ్రులకు సమాచారం అందించారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనీ...