1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 ఆగస్టు 2023 (17:22 IST)

టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి.. సీఎం ప్రకటన

bhumana karunakar reddy
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి మరోసారి ఎంపికయ్యారు.  ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. టీటీడీ కొత్త చైర్మన్‌గా తమ పార్టీ సీనియర్ నేత, తిరుపతి ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డిని నియమించనున్నట్లు ఆయన ప్రకటించారు. 
 
ప్రస్తుత చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం త్వరలో ముగియనుండడంతో ఈ మార్పు అవసరమనే విషయాన్ని గుర్తు చేశారు. టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి ఎన్నిక కావడం ఇది రెండోసారి. 
 
గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో ఒకసారి టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు.