1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Chandrababu will attend wedding functions in Visakha

నేడు వైజాక్‌కు చంద్రబాబు.. వివాహాది శుభకార్యాలయాలకు హాజరు

chandrababu naidu
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం విశాఖపట్టణం పర్యటనకు వెళుతున్నారు. సాయంత్రం 3 గంటలకు ఆయన హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖకు వెళుతారు. సాయంత్రం 4 గంటలకు విశాఖకు చేరుకుని, ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గంలో అచ్యుతాపురానికి వెళతారు. అక్కడ యలమంచిలి టీడీపీ ఇన్‌ఛార్జ్ ప్రగడ నాగేశ్వర రావు నివాసానికి చేరుకుంటారు. ఇక్కడ ఇటీవల జరిగిన నాగేశ్వర రావు కుమారుడు రాజు - కోడలు భాను నూతన దంపతులను ఆశీర్వదిస్తారు.
 
ఆ తర్వాత సాయంత్రం 6.30 గంటలకు చంద్రబాబు విశాఖ ఎయిర్ పోర్టు స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు కుమారుడి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించి, ఉడా పార్కులో బి.వెంకటరమణయాదవ్ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ఆయన వైజాగ్ నుంచి తిరిగి విజయవాడకు వెళతారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఆత్మహత్య చేసుకున్న స్నేహితుడి మృతదేహంపై అఘోరా..?