సంబంధిత వార్తలు
- పట్టపురాణిని నిర్ణయించేంది రాజే కదా? జీవీఎల్ నరసింహా రావు
- ఏపీ అసెంబ్లీని ప్రోరోగ్ చేసిన గవర్నర్ .. ఆర్డినెన్స్ జారీకి వ్యూహం
- కాంట్రాక్టు ఉద్యోగులపై సీఎం జగన్ 'రివర్స్' అస్త్రం
- సెలెక్ట్ కమిటీని నియమిస్తావా... చర్యలు తీసుకునేనా... మండలి ఛైర్మన్ హుకుం
- ఏపీ రాజధాని నిర్ణయం రాష్ట్రమే చూసుకుంటుంది... మాకు సంబంధం లేదన్న కేంద్రం
పంట పొలాల్లో చార్టెడ్ ప్లేన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఓ చిన్నపాటి విమానం ఒకటి పొలాల్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఇంజిన్లో సాంకేతిక లోపం కారణంగా ఈ విమానం ల్యాండ్ అయింది.
నింగిలో ఎగురుతున్న సమయంలో ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తినట్టు పైలటు గుర్తించాడు. దీంతో అత్యవసరంగా ల్యాండ్ చేసేందుకు సమీపంలో ఎక్కడా విమానాశ్రయం లేదని గ్రహించిన పైలెట్... బ్రహ్మసముద్రం మండలం ఎరడికెరాలో విమానం పొలాల్లో దిగింది.
ఈ విమానం కర్ణాటకకు చెందిన ఓ ఎంఎన్సీదిగా గుర్తించారు. విమానం ల్యాండ్ అయిన ప్రాంతం చదునుగా ఉండటంతో, ప్రయాణికులకు స్వల్ప గాయాలు మినహా మరే ప్రమాదమూ జరగలేదని తెలుస్తోంది.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, విమానం వద్దకు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. విమానం ఎమర్జెన్సీ మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
