1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. CJI NV Ramana comments on Krishna Water Issue

ఏపీ పిటిషన్‌పై విచారణ అక్కర్లేదు.. మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోండి.. సుప్రీంకోర్టు

CJI NV Ramana
కృష్ణా జలాల పంపకాలపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొంది. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న తెలుగు వ్యక్తి ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంపై ఏపీ ప్రభుత్వం ఓ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 
 
ఈ విచారణ సందర్భంగా తెలంగాణ తరపు న్యాయవాది మాట్లాడుతూ… ఏపీ వేసిన పిటిషన్‌పై విచారణ అవసరం లేదని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గెజిట్ జారీ చేసిందన్నారు. ఏపీ తరపు న్యాయవాది మాట్లాడుతూ… అక్టోబర్ నుంచి గెజిట్ అమల్లోకి వస్తుందని… గెజిట్‌ను ఇప్పటి నుంచే అమలు చేయాలని, కొన్ని నెలల పాటు నీటిని నష్టపోకూడదనే తాము అడుగుతున్నామని అన్నారు.
 
ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ… జల వివాదం అంశాన్ని రెండు రాష్ట్రాలు మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోవాలని సూచించారు. తాను ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెందిన వ్యక్తినని చెప్పారు. ఇక మధ్యవర్తిత్వానికి సంబంధించి తాము పూర్తిగా సహకరిస్తామని… లేని పక్షంలో ఈ పిటిషన్‌ను వేర్ బెంచ్‌కు బదిలీ చేస్తామని చెప్పారు. 
 
ఇరువైపు న్యాయవాదులు రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించి సమస్యను పరిష్కరించాలని తాను కోరుకుంటున్నానని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఈ వివాదంలో తాము అనవసరంగా జోక్యం చేసుకోదలుచుకోలేదన్నారు. దీంతో, ఏపీ తరపున హాజరైన న్యాయవాది దుష్యంత్ దవే సమయం కావాలని కోరగా… తదుపరి విచారణను సుప్రీంకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. మరోవైపు తెలంగాణ తరపున న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ కోర్టుకు హాజరయ్యారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
సాగర్‌పై కేసీఆర్ వరాల జల్లు: దేశానికే ఆదర్శంగా 24 గంటల విద్యుత్