1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Corona to another 73 in the BSF

బీఎస్ఎఫ్‌లో మరో 73 మందికి కరోనా

Corona
భద్రతా దళాల్లో కరోనా మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బీఎస్ఎఫ్‌లో ఇప్పటికే 1500 మందికిపైగా జవాన్లు కరోనా బారినపడగా, తాజాగా మరో 73 మందికి ఈ మహమ్మారి వైరస్ సోకింది. దీంతో బీఎస్ఎఫ్‌లో మొత్తం బాధితుల సంఖ్య 1,659కి పెరిగింది.
 
తాజాగా, 14 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఈ వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 927కు పెరిగింది.

మరోవైపు, ఇండో టిబెటిన్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ)లోనూ కొత్తగా 12 మందికి వైరస్ సోకగా, 12 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఫోర్స్‌లో ఇంకా 178 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 298 మంది కోలుకున్నట్టు ఐటీబీపీ వర్గాలు తెలిపాయి.
About Writer
ఎం
తర్వాతి కథనం
టిక్‌టాక్ వ్యవహారంలో అమేజాన్ వెనక్కి తగ్గిందా? కారణం?