శనివారం, 28 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 27 ఏప్రియల్ 2023 (19:49 IST)

సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకుని జవాన్ ఆత్మహత్య

CRPF
CRPF
హైదరాబాద్‌లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) జవాన్ గురువారం ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన చోటుచేసుకుంది. బేగంపేటలోని చికోటీ గార్డెన్‌లో ఉన్న సీఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ మహేశ్ చంద్ర నివాసంలో గార్డు డ్యూటీని కేటాయించిన దేవేంద్ర కుమార్ తన సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
 
ఉత్తరప్రదేశ్‌కు చెందిన కానిస్టేబుల్ వ్యక్తిగత కారణాల వల్లే ఈ విపరీతమైన చర్య తీసుకున్నట్లు భావిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కుమార్ డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని, విఫలమైన సంబంధమే అతని ఆత్మహత్యకు కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
 
కానిస్టేబుల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా, ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.