సోమవారం, 27 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 అక్టోబరు 2025 (16:49 IST)

తుఫాను ప్రారంభమైంది... భూమిని సమీపించే కొద్దీ తీవ్రమవుతుంది.. ఏపీఎస్డీఎంఏ

Nara Lokesh
Nara Lokesh
తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్న మోంతా తుఫాను తీరాన్ని తాకడం ప్రారంభమైందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఏపీఎస్డీఎంఏ) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖార్ జైన్ సోమవారం తెలిపారు. తీరప్రాంత జిల్లాల్లో వర్షాలు, బలమైన గాలులు వీస్తున్నాయని ఆయన అన్నారు.
 
తుఫాను ప్రారంభమైంది. తీరప్రాంత జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని జైన్ ఒక ప్రకటనలో తెలిపారు, ఇది భూమిని సమీపించే కొద్దీ మరింత తీవ్రమవుతుందని అన్నారు.
 
మొంథా తుఫాన్ రూపంలో ముంచుకొస్తున్న పెను విపత్తును ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధమవుతోంది. సహాయక చర్యలను మరింత సమర్థంగా, వేగంగా చేపట్టే క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు... మంత్రి నారా లోకేశ్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. తుపాను సహాయక చర్యలకు సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో)తో సమన్వయం చేసుకునే గురుతర బాధ్యతను లోకేశ్‌కు కేటాయించారు.
 
సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో మొంథా తుపాను‌పై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తుపాను సమయంలో ఒక్క ప్రాణం కూడా పోకూడదని, ఆస్తి నష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యం కావాలని ఆయన స్పష్టం చేశారు. తుఫాన్ కదలికలు, తాజా పరిస్థితులపై ప్రజలకు ఎప్పటికప్పుడు రియల్ టైమ్‌లో సమాచారం అందించాలని ఆదేశించారు. మంగళవారం ఉదయం నుంచి ప్రతీ గంటకూ ఒక బులిటెన్ విడుదల చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.
 
తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రభుత్వ యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత సమాచారం ప్రకారం తుపాను కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని లోకేశ్ దిశానిర్దేశం చేశారు.