మంగళవారం, 2 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: మంగళవారం, 10 ఆగస్టు 2021 (17:26 IST)

ఢిల్లీ కాంగ్రెస్ కేంద్రకమిటీ నుండి ఆంధ్రప్రదేశ్ నుండి నలుగురికి పిలుపు..

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఏపి కాంగ్రెస్ సీనియర్ నేతలకు, హైకమాండ్ నుండి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది.
 
11వ తేది బుధవారం మధ్యాహ్నం ఏఐసిసి మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీతో, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర మాజీమంత్రి పల్లం రాజు, మాజీ ఎంపీ కెవిపి రామచంద్ర రావు, చింతా మోహన్ భేటి కానున్నారు.

ఈ భేటి ఆంద్రప్రదేశ్‌లో కాంగ్రెస్ బలోపేతంపై నిర్ణయంతీసుకొనే అవకాశాలు కనబడుతున్నాయి.