మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 నవంబరు 2019 (09:46 IST)

తాహసీల్దారు విజయారెడ్డిని ఎవరు చంపారు? ఎమ్మెల్యేనా? రైతా?

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్య ఇపుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదుపుతోంది. తన కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న విజయారెడ్డిని సురేశ్ అనే రైతు పెట్రోల్ పోసి సజీవదహనం చేశాడు. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన కారు డ్రైవర్ కూడా ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన సంచలనం రేపింది. 
 
ఈ నేపథ్యంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ ఆడియో టేప్ తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఆడియో ఇద్దరు స్థానికుల మధ్య జరిగిన సంభాషణగా తెలుస్తుండగా, గౌరెల్లి భూముల వివాదంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కూడా ఉన్నారన్న ప్రస్తావన వచ్చింది.
 
స్థానిక ఎమ్మెల్యే రైతుల నుంచి రూ.30 లక్షలు తీసుకున్నారని, అందులో విజయారెడ్డిని హత్య చేసిన సురేశ్‌కు చెందిన రెండు, మూడు లక్షలు ఉంటాయని అనుకున్నారు. డబ్బులు నొక్కేసే అధికారులకు ఇలా కావాల్సిందేనని చెప్పుకున్నారు. 
 
ఈ ఆడియో టేప్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. కాగా, గౌరెల్లి భూముల విషయంలో తనకు ప్రమేయముందనడాన్ని మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఖండించారు. సురేష్ ఎవరో తనకు తెలియదని స్పష్టం చేశారు.