1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Duronto Express Train Accident In Bhimadole Railway Gate

భీమడోలు రైల్వేగేటు వద్ద ఘోర ప్రమాదం..

railway track
ఏపీలోని ఏలూరు భీమడోలు రైల్వేగేటు వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బొలేరో వాహనాన్ని దూరంతో ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టి.. ఐదు గంటలపాటు నిలిచిపోయింది.
 
గేటును ఢీకొట్టి బొలేరో వాహనం ట్రాక్‌పైకి రావడంతో ఈ ఘటన జరిగింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణం వెళ్తున్న దూరంతో ఎక్స్‌ప్రెస్.. ఏలూరు జిల్లా భీమడోలు వద్ద బొలెరో వాహనాన్ని ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. 
 
ఈ ఘటన గురువారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో జరిగింది. ప్రమాదంలో బొలెరో వాహనం పూర్తిగా ధ్వంసం కాగా, రైలు ఇంజిన్ దెబ్బతింది. రైల్వే అధికారులు మరో ఇంజిన్ తీసుకొచ్చి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు.
తర్వాతి కథనం
Xiaomi Redmi Note 12 Turbo విడుదల