శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 21 సెప్టెంబరు 2022 (19:33 IST)

వైకాపా అధ్యక్షుడు జగన్‌కు షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం

ys jagan
వైకాపా అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం తేరుకోలేని షాకిచ్చింది. వైకాపా శాశ్వత అధ్యక్షుడుగా జగన్మోహన్ రెడ్డికి ఎన్నిక చెల్లదంటూ స్పష్టం చేసింది. ఈ మేరకు వైకాపా ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి రాసిన లేఖలో ఈసీ ప్రస్తావించింది. ఇటీవల జరిగిన వైకాపాలో ప్లీనరీ భాగంగా వైకాపా శాశ్వత అధ్యక్షుడుగా జగన్‌ను ఆ పార్టీ సభ్యులు ఎన్నుకున్న విషయం తెల్సిందే. 
 
వివిధ మీడియా, పత్రికల్లో వచ్చిన వార్తలను చూసిన కేంద్ర ఎన్నికల సంఘం చూసిన తర్వాత, ఇది వాస్తవమేనా? అని నిర్ధారించుకునేందుకు విజయిసాయి రెడ్డికి పలుమార్లు లేఖలు రాసింది. అయితే, ఈ లేఖలకు సాయిరెడ్డి నుంచి స్పందన రాకపోవడంతో ఇది వాస్తవమేనని తాము భావిస్తున్నాని దీనిపై పార్టీలో అంతర్గత విచారణ జరిపి, అసలు విషయమేమిటో తెలుపాలంటూ తాజా లేఖలో సాయిరెడ్డిని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. 
 
పైగా, ఈ లేఖలో కేంద్ర ఎన్నికల సంఘం పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి అయినా తరచూ ఎన్నికలు జరుగుతూ ఉండాల్సిందేనని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అదేసమయంలో ఏ పార్టీలో అయినా ఓ నేత శాశ్వత అధ్యక్షుడుగాగానీ, ఆ నేతకు శాశ్వత పదవులుగానీ వర్తించవని కూడా ఈసీ స్పష్టం చేసింది. 
 
ఏ పార్టీ అయినా ఎన్నికల సంఘం జారీ చేసిన నియమ నిబంధనల మేరకే జరగాల్సివుందని తెలిసింది. జగన్ శాశ్వత అధ్యక్షుడుగా ఎన్నికై ఉంటే వైకాపా నిర్ణయం ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు విరుద్ధమేనని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది.