శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 21 సెప్టెంబరు 2022 (14:27 IST)

అన్నీ ఆలోచించిన తర్వాతే నా నాన్న పెడుతున్నాం : సీఎం జగన్

ys jagan
విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి పాత పేరును తొలగించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పేరును ఏపీ ప్రభుత్వం పెట్టింది. ఈ మేరకు బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లును మంత్రి విడదల రజనీ ప్రవేశపెట్టగా దాన్ని విపక్ష పార్టీల మద్దతు లేకుండానే అధికార పార్టీ సభ్యులు బలంతో ఆమోదం తెలిపంది. 
 
ఈ సందర్భంగా సీఎం జగన్ టీడీపీ చంద్రబాబు నాయుడుపై మరోమారు తన అక్కసును వెళ్ళగక్కారు. అన్నీ ఆలోచించిన తర్వాతే పేరు మార్పు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అయితే, బిల్లు ఆమోదం పొందే సమయంలో టీడీపీ సభ్యులు కూడా ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. టీడీపీ సభ్యులతో చంద్రబాబు కావాలనే రాద్దాంతం చేయిస్తున్నారని ఆరోపించారు.
 
పైగా, ఎన్టీఆర్‌కు చంద్రబాబు కంటే తానే ఎక్కువ గౌరవం ఇస్తానని చెప్పారు. చంద్రబాబు వెన్నుపోటు పొడవకుంటే ఎన్టీఆర్ మరికొంత కాలం జీవించివుండేవారని సీఎం జగన్ అన్నారు. ఎన్టీఆర్‌పై తమకు కూడా మమకారం, ప్రేమ ఉందన్నారు.