శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 నవంబరు 2019 (13:42 IST)

మహిళామణులు కాదు.. పేకాట రాణులు...

గుంటూరు జిల్లా తాడేపల్లిలో పేకాట ఆడుతున్న పలువురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి లక్షా 36 వేల రూపాయలను కూడా స్వాధీనం చేసుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తాడేపల్లి పట్టణంలో మహిళలు విచ్చలవిడిగా పేకాట ఆడుతున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు పేకాట శిబిరాలను గుర్తించి వాటిపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. 
 
ముఖ్యంగా, పట్టణంలోని మహానాడు పట్టాభి రామయ్య కాలనీ ప్రాంతంలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో తాడేపల్లి సీఐ అంకమ్మరావు మహిళా పోలీసులతో కలసి ఆదివారం రాత్రి దాడి చేశారు. 
 
ఈ దాడిలో పేకాట ఆడుతున్న 8 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి లక్షా 36 వేల 250 రూపాయల నగదును, 8 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.