1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ఏపీలో 17 నుంచి ఇంజనీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్

students
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 17వ తేదీ నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. ఈ విషయాన్ని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హెమచంద్రారెడ్డి తెలిపారు. ఈ ఇంజనీరింగ్ ప్రక్రియ మొత్తం వచ్చే 25వ తేదీతో ముగుస్తుందని తెలిపారు. 
 
ఆయన వివిధ సెట్ల కౌన్సెలింగ్ వివరాలను ఆయన సోమవారం మంగళగిరిలోని మండలి కార్యాలయంలో విడుదల చేశారు. ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈ-సెట్ రెండో విడత కౌన్సెలింగ్ ఈ నెల 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు, ఐ-సెట్ రెండో విడత కౌన్సెలింగ్ ఈ నెల 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు, పీజీ సెట్ కౌన్సెలింగ్ ఈ నెల 27 నుంచి నవంబరు 3వ తేదీ వరకు జరుగుతాయని వివరించారు. 
 
అయితే, డిగ్రీ విద్యార్థులకు ఈ యేడాది నుంచి రెండు నెలల ఇంటర్న్‌షిప్ ఉంటుందని, ఇందులో కొందరికి వర్చ్యువల్, మరికొందరికి ఆఫ్‌లైన్‌లో ఇంటర్న్‌షిప్ అందించేలా వివిధ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. అదేసమయంలో ఈ నెల 15వ తేదీ నుంచి డిగ్రీ మొదటి సంవత్సర తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు.