సంబంధిత వార్తలు
- రూ.300 కోట్ల ఆస్తికోసం మామను హత్య చేసిన కోడలు.. రూ.కోటి ఖర్చు చేసింది..
- కువైట్ బిల్డింగ్ ఫైర్ : 40 మంది భారతీయ కార్మికుల మృతి
- రోడ్డు ప్రమాదం- నలుగురు యూట్యూబర్ల మృతి.. ర్యాష్ డ్రైవింగే కారణమా?
- మెక్సికోలో దారుణం- సెల్ఫీలపై మోజు.. రైలు ఢీకొని యువతి దుర్మరణం
- ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో 40వేల మెజారిటీ 8 ఎన్డీయే అభ్యర్థుల గెలుపు
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి
కృష్ణా జిల్లాలోని కృత్తివెన్ను సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఈ ప్రమాదం జరిగింది.
మరణించినవారిలో 26 ఏళ్ల భూషణం, 27 ఏళ్ల ధర్మవరప్రసాద్, 32 ఏళ్ల లోవరాజు, నాగరాజు, జయరామ్ వున్నట్లు గుర్తించారు. మృతులు కోనసీమ జిల్లాకు చెందినవారు కొందరు, తమిళనాడు రాష్ట్రానికి చెందిన మరికొందరు వున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఒక లారీలో పదిమంది, మరో లారీలో ఇద్దరు వున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. కాగా మంత్రి కొల్లు రవీంద్ర మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
