శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 17 జులై 2020 (17:48 IST)

పరీక్షల నిర్వహణలో కోవిడ్-19 ప్రోటోకాల్‌లను అనుసరించండి: వీసీలకు గవర్నర్ పిలుపు

విజయవాడలోని రాజ్ భవన్‌లో శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు మరియు ఇతర నిర్వాహకులను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వా భూషణ్ హరిచందన్ మాట్లాడుతూ చివరి సంవత్సరం పరీక్షల నిర్వహణలో కోవిడ్ -19 ప్రోటోకాల్స్ కట్టుబడి ఉండాలని అన్నారు. 

యుజిసి మార్గదర్శకాల ప్రకారం విద్యార్థులకు కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన పరిస్థితి కారణంగా ఉన్నత విద్యాసంస్థలు ఆన్‌లైన్ తరగతులను వర్చువల్ మోడ్‌లో నిర్వహించడానికి నిర్ణయించాయని రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ అయిన గవర్నర్ అన్నారు.

సాంప్రదాయ తరగతి గది బోధనా పద్దతిని ఆన్‌లైన్ తరగతులు భర్తీ చేయలేవని ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్ మహమ్మారి ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి విద్యాసంస్థలు తగిన ఇ-కంటెంట్‌ను అభివృద్ధి చేసి ఆన్‌లైన్ వ్యవస్థ ద్వారా తరగతులు నిర్వహించడానికి పాఠ్యాంశాలను పునర్నిర్మించి రూపకల్పన చేయాలన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్న 20 రాష్ట్ర విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో గవర్నర్ సంభాషించేటప్పుడు, మునుపటి విద్యాసంవత్సరం యొక్క సిలబస్‌ను ఆన్‌లైన్ మోడ్ ద్వారా పూర్తి చేయడంలో విశ్వవిద్యాలయాలు అవలంబించిన వినూత్న పద్దతుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, యుజిసి మార్గదర్శకాల ప్రకారం, ఆఫ్-లైన్ లేదా ఆన్‌లైన్ మోడ్‌లో, కోవిడ్-19 ను అనుసరించి, అండర్గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల చివరి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడానికి తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఈ సమావేశంలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి డా అదిమూలపు సురేష్ మాట్లాడుతూ కోవిడ్-19 మహమ్మారి ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు ఉన్నత విద్యాసంస్థలు ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా రీ-డిజైన్, రీ ఫార్మాట్ మరియు రీ-ఓరియంట్ పాఠ్యాంశాలను రూపొందించడం అవసరమన్నారు.

మహమ్మారి సృష్టించిన అననుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ, విద్యావ్యవస్థ యొక్క పవిత్రతను నిలబెట్టడంలో మరియు పరీక్షల నిర్వహణలో సమగ్రతను కాపాడుకోవడంలో ప్రభుత్వం రాజీపడదని మంత్రి అన్నారు.

సమావేశంలో ఎపి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ కె. హేమచంద్ర రెడ్డి, గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, కాలేజియేట్ ఎడ్యుకేషన్ స్పెషల్ కమిషనర్ నాయక్ పాల్గొన్నారు.