1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 21 ఫిబ్రవరి 2024 (10:53 IST)

బొత్స vs గంటా- కేరాఫ్ చీపురుపల్లి.. రసవత్తర పోరు

ganta
వైసీపీ మూలాల్ని దెబ్బతియ్యాలన్న కమిట్‌మెంట్‌తో ఉన్న తెలుగుదేశం పార్టీ… ఇప్పుడు బొత్స మీదకి నేరుగా ఫోకస్ చేసింది. చీపురుపల్లిలో ఆయన్ను ఓడించడాన్ని ఛాలెంజ్‌గా తీసుకుంది. ఇందుకోసం టీడీపీ - వైకాపాలు గట్టి పాపులర్ వున్న నేతలను రంగంలోకి దించనుంది. ఇందులో భాగంగా బొత్స- గంటా శ్రీనివాసరావులు బరిలోకి దిగనున్నారు. 
 
ప్రస్తుతం బొత్సను ఓడించేందుకు "ఆపరేషన్‌ చీపురుపల్లి" చేపట్టింది టీడీపీ. చీపురుపల్లి  తెలుదేశం పార్టీ అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావును నియమించాలన్న ప్రపోజల్‌ని సీరియస్‌గా ఆలోచిస్తోంది. బొత్సకు చెక్‌ పెట్టాలంటే గంటాను మించిన మరో ఆప్షన్ లేదని డిసైడైంది టీడీపీ. 
 
గంటా శ్రీనివాసరావు, ఆయన వియ్యంకుడు, మాజీ మంత్రి నారాయణతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు వ్యూహకర్త రాబిన్‌శర్మ. సో బొత్స- గంటాల మధ్య రసవత్తరమైన పోరు నెలకొననుంది.