1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 2 మార్చి 2021 (09:35 IST)

అనంతపురంజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురు మృతి

అనంతపురం జిల్లా పెనుకొండ మండలం లోని ఎర్రమంచి లో గల కియా కార్ల తయారీ పరిశ్రమ ప్రధాన గేటు వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై కారు గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

ప్రమాదానికి గురైన కారు బెంగుళూరు వైపు నుంచి హైదరాబాద్ వరకు వెళుతుంది. జాతీయ రహదారిపై ఉన్న వేగ నిరోధక వద్దా ముందర వెళ్తున్న గుర్తుతెలియని వాహనం నెమ్మదించడం తో వేగంగా వచ్చిన కారు గుర్తుతెలియని వాహనం ఢీకొంది.

ప్రమాదంలో బెంగళూరుకు చెందిన మనోజ్ విట్టల్, అతనితో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

ప్రమాదంలో ఇద్దరు పురుషులు ఇద్దరు మహిళలు మృతి చెందారు.మృతదేహాలను పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
మృతిచెందిన వారి వివరాలు.. 
రేఖ(21), కిషన్ గంజ్ నార్త్ దిల్లీ 
ఆంచల్ సింగ్(21)
మహబూబ్ఆలం(31)ఆర్.టీ.నగర్ నార్త్ బెంగళూరు
మనోజ్ మిట్టల్ (38)ప్లాటినం సిటీ నార్త్ బెంగళూరు.