1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 10 డిశెంబరు 2021 (18:05 IST)

గుంత‌క‌ల్లులో భారీగా గంజాయి ప‌ట్టివేత‌, అక్రమ రవాణా, విక్రయాలు!

ఈ ముఠా సభ్యులు అందరూ దాదాపుగా స్నేహితులు. అక్రమంగా, సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్ధేశ్యంతో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు తెరలేపారు. విజయనగరం జిల్లా సాలూరు సమీపంలోని ఒడిస్సా సరిహద్దుల్లో షేక్ తాజ్ సహకారంతో  గంజాయి కొనుగోలు చేసి అక్కడి నుండీ గుంతకల్లు, వజ్రకరూరు, ఉరవకొండ, అనంతపురం ప్రాంతాలకు కార్లలో  తీసుకొస్తారు. తక్కువ ధరలకు కొనుగోలు చేసి ఇక్కడ అధిక ధరలకు విక్రయిస్తారు.
 
 
జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఆదేశాల మేరకు గుంతకల్లు డీఎస్పీ యు.నరసింగప్ప పర్యవేక్షణలో ఉరవకొండ సి.ఐ శేఖర్ ఆధ్వర్యంలో వజ్రకరూరు ఎస్సై వెంకటస్వామి, సిబ్బంది జాఫర్ , నాగభూషణ, చంద్రశేఖర్ , పాపా నాయక్ , మోహన్ లు ప్రత్యేక బృందంగా ఈ ముఠాను అరెస్టు చేశారు.
 
 
గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్న ఉరవకొండ సి.ఐ శేఖర్ ఆధ్వర్యంలో వజ్రకరూరు ఎస్సై వెంకటస్వామి, సిబ్బంది జాఫర్ , నాగభూషణ, చంద్రశేఖర్ , పాపా నాయక్ , మోహన్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.