గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 అక్టోబరు 2022 (08:55 IST)

పెళ్లికి నిరాకరించిన బాలికపై యువకుడి దాడి... ఫిరంగిపురంలో ఘటన...

woman victim
గుంటూరు జిల్లాలో మరో దారుణం జరిగింది. పెళ్లికి నిరాకరించిన ఓ యువతిపై యువకుడు కర్రలతో దాడి చేశాడు. ఇది పంచాయతీకి చేరగా, అక్కడ ఆ యువకుడి కుటుంబ సభ్యులు వీరంగం వేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ఫిరంగిపురం గ్రామానికి చెందిన 16 యేళ్ల బాలికకు వివాహం నిశ్చియమైంది. కానీ, అదే గ్రామంలోని పంతు వీధికి చెందిన మణికంఠ (23)ల అనే యువకుడు ఆ బాలికను ప్రేమిస్తున్నట్టు ప్రచారం చేసుకుంటూ, ఆ బాలికను వేధిస్తూ వచ్చాడు. ఇది గ్రామ పెద్దలతో పాటు ఇరు కుటుంబ సభ్యుల దృష్టికి వెళ్లింది. దీంతో సమస్య పరిష్కారం కోసం కూర్చొని మాట్లాడుకుందాని చెప్పి గ్రామ పెద్దల సమక్షంలో సమావేశమయ్యారు.
 
తాను మణికంఠను పెళ్లి చేసుకోనని అందరి సమక్షంలో ఆ బాలిక తెగేసి చెప్పింది. పెద్దలు కుదిర్చిన వివాహాన్నే చేసుకుంటానని తెలిపింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరగడంతో అది ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో బాలిక, అమె కుటుంబ సభ్యులపై మణికంఠ, అతని బంధువులు దాడికి దిగారు. 
 
ఈ ఘటనలో బాలికతో పాటు 11 మంది గ్యాపడ్డారు. వీరిలో 9 మందిని నరసారావుపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బాలికతో పాటు ఆమె బంధువులను గుంటూరు సర్వజన ఆస్పత్రికి తరలించారు. బాలక ఫిర్యాదుతో మణికంఠ, అతని బంధువులపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.