శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 23 నవంబరు 2019 (19:25 IST)

"మన నుడి - మన నది"కి ఆ ఇద్దరు మద్దతు

తెలుగుభాష పరిరక్షణ, నదీజలాల స్వచ్ఛ సంరక్షణ కోసం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ "మన బడి - మన నది" కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఇద్దరు కీలక నేతలు మద్దతునిచ్చారు. వారిలో ఒకరు ప్రముఖ కవి జొన్నవిత్తల రామలింగేశ్వర రావు కాగా మరొకరు మండలి బుద్ధ ప్రసాద్. వీరిద్దరూ శనివారం హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్‌ను కలిసి తమ మద్దతును ప్రకటించారు.
 
ఇదే అంశంపై వారు స్పందిస్తూ, పవన్ చేపట్టిన 'మన నుడి - మన నది' కార్యక్రమానికి తాము మద్దతు ఇస్తున్నట్టు ప్రముఖ సినీ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, భాషాభిమాని మండలి బుద్ధప్రసాద్ వెల్లడించారు. 
 
భాష నశించిన రోజున జాతి కూడా నశిస్తుందని, రాజకీయాలకు అతీతంగా తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని వారిద్దరూ పిలుపునిచ్చారు. పవన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, మిగిలిన పార్టీలు కూడా పవన్‌తో కలిసి పనిచేయాలని సూచించారు.