శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Modified: శనివారం, 29 డిశెంబరు 2018 (15:12 IST)

జగన్... నీ ముఖానికి ఏం విలువుంది? నీ చెల్లి బ్రాహ్మణుడిని...

తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు సంధించారు. జగన్ మోహన్ రెడ్డికి రెడ్డి కుల పిచ్చి వున్నదంటూ ధర్మపోరాట దీక్షలో చేసిన జేసీ, మరోసారి జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. జగన్... రెడ్డి, రెడ్డి అంటూ వున్నారు. రెడ్ల ఓట్ల శాతం ఎంత? ఐనా సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, జనార్దన్‌రెడ్డి, చెన్నారెడ్డి, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రులు కాలేదా? రెడ్ల ఓట్లతో అయ్యారా? 
 
ప్రజల ఆదరణ ఉంటే ముఖ్యమంత్రి అవుతారంతే... అసలు నీ సత్తా ఏంటి? నీ ముఖానికి ఏం విలువ ఉంది? రెడ్లయినంత మాత్రాన ఏమయినా కొమ్ములు వుంటాయా...? నీ చెల్లెలు ఏ కులస్థుడిని పెళ్లి చేసుకుంది? బ్రాహ్మణుడిని చేసుకోలేదా అంటూ ప్రశ్నించారు. సమాజంలో అంతా ఒక్కటే అనే భావనతో నీ చెల్లి అలా పెళ్లి చేసుకుందని చెప్పుకొచ్చారు. 
 
పవన్ కల్యాణ్, జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ కులం కార్డుతో గెలవాలనుకుంటున్నారనీ, ఆ ఇద్దరూ వచ్చే ఎన్నికల్లో సంకనాకి పోతారంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. తుఫానులతో ఏపీ అతలాకుతలం అయినప్పుడు రాని ప్రధానమంత్రి ఇప్పుడు వచ్చి ఏం ఉద్ధరిద్దామనో అర్థంకావడం లేదంటూ మండిపడ్డారు.