సంబంధిత వార్తలు
- రైల్వే ప్రయాణీకుల కోసం.. ఆగస్టు 7 నుంచి పలు రైళ్లు రద్దు.. దారి మళ్లింపు
- ఏపీలో కొత్త ప్రయోగం : రైతుల కోసం 4.5 లక్షలమందితో 19,364 వాట్సాప్ గ్రూపులు
- కరోనా మూడో తరంగ నివారణలో ఆంధ్రప్రదేశ్ దిక్సూచీ కావాలి: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్
- అక్రమ మద్యం తరలించడం కొట్టి చంపేంత నేరమా?: సీఎం జగన్పై నారా లోకేష్ ఫైర్
- పులిచింతల నిర్మాణంలో నాసికరకం : విరిగిన గేటు.. ఆందోళనలో అధికారులు
ప్రభుత్వ విప్ కి జర్నలిస్టుల సమస్యల్ని నివేదించిన ఏపీబీజేఏ
ప్రభుత్వ విప్
ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానును ఆయన స్వగృహంలో కలిసిన ఏపీబీజేఏ నాయకుడు పఠాన్ మీరా హుస్సేన్ ఖాన్ బృందం ఆయన్ని ఘనంగా శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఉదయభాను సతీమణి, విమలభానును కూడా మర్యాద పూర్వకంగా కలిసిన జర్నలిస్టు సంఘ రాష్ట్ర నాయకులు పి.మీరాహుస్సేన్ ఖాన్ బృందం ఆమెను కూడా శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చాలు అందజేసి చిరుసత్కారం చేశారు. ఉదయభానుకి మీరాహుస్సేన్ స్వీట్లు తినిపించారు. జర్నలిస్టుల సమస్యలను తెలియజేయగా, తాను ప్రభుత్వ విప్ గా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని ఉదయ భాను హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పఠాన్ సైదాఖాన్, న్యాయవాది పఠాన్ కరీముల్లా, అల్లావుద్దీన్. నరేంద్రనాయక్, ఎలిషా తదితరులు పాల్లొన్నారు.
