1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Markapuram Bus Mishap: Passengers Flagged Bus Issues Before Accident

బస్సు కదిలేటప్పుడే డ్రైవర్‌ను అలెర్ట్ చేసిన ప్రయాణీకులు.. కానీ?

Bus accident
Bus accident
మార్కాపురం జిల్లాలోని రాయవరం వద్ద ఘోర ప్రమాదానికి గురైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రయాణికులు, జర్నీ ప్రారంభం కావడానికి ముందే వాహనం పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటివరకు 13 మంది ప్రాణాలను బలిగొన్న ఈ విషాద ఘటనకు సంబంధించి వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే? బస్సు సరైన స్థితిలో లేదని ప్రయాణికులు డ్రైవర్‌ను, బస్సు సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రయాణికుల ఫిర్యాదులకు స్పందించిన సిబ్బంది, సుర్రగొండపాలెం వద్ద బస్సును దాదాపు ఒక గంట పాటు నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు. 
 
మరమ్మతుల అనంతరం ప్రయాణం తిరిగి ప్రారంభించిన కాసేపటికే, రాయవరం సమీపంలో ఆ బస్సు ఒక టిప్పర్‌ను ఢీకొని మంటలకు ఆహుతైంది. ఈ దుర్ఘటనలో 14 మంది ప్రయాణికులు మరణించగా, పలువురు గాయపడ్డారు. 
 
ప్రాథమిక విచారణ సందర్భంగా, ప్రమాదం జరగడానికి ముందే బస్సు స్టీరింగ్ జామ్ అయిపోయిందని డ్రైవర్ అధికారులకు తెలిపినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 
తర్వాతి కథనం
Bangladesh bus accident: బంగ్లాదేశ్‌లో నదిలో మునిగిన బస్సు.. 23మంది మృతి (video)