1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 31 మార్చి 2022 (10:52 IST)

ఆత్మకూరు (నెల్లూరు) వైకాపా అభ్యర్థిగా గౌతంరెడ్డి సతీమణి!!

నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యుడు, ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే, ఈ స్థానం నుంచి మేకపాటి గౌతంరెడ్డి సతీమణి శ్రీకీర్తిని బరిలోకి దించాలని వైకాపా అధిష్టానం భావిస్తుంది. కానీ, ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై మేకపాటు కుటుంబ సభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 
 
ఒకవేళ ఉప ఎన్నికల్లో మేకపాటి శ్రీకీర్తి పోటీ చేసిన పక్షంలో పోటీ నుంచి దూరంగా ఉండాలని ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీతో పాటు.. జనసేన, బీజేపీ నేతలు భావిస్తున్నట్టు సమాచారం. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం తన నిర్ణయాన్ని వెల్లడించాల్సివుంది. 
 
ఈ ఎన్నికల్లో వైకాపా కనుక శ్రీకీర్తిని బరిలోకి దింపితే తాము కొనసాగిస్తున్న ఆచారం ప్రకారం పోటీ నుంచి తప్పుకోవాలని టీడీపీ భావిస్తుంది. వ్యక్తుల మృతితో ఖాళీ అయిన స్థానంలో వారి కుటుంబ సభ్యులు బరిలోకి దిగితే పోటీ చేయకూడదన్న ఆచారాన్ని టీడీపీ పాటిస్తూ వస్తుంది. 
 
ఆత్మకూరు విషయంలోనూ ఇదే నిర్ణయాన్ని అనుసరించాలని భావిస్తుంది. మరోవైపు, ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించే అంశంపై ఎన్నికల సంఘం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.