1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: సోమవారం, 5 అక్టోబరు 2020 (16:02 IST)

జగన్‌ను అమిత్ షా మందలించారా? జగన్ బెండ్ అయ్యే రకం కాదు, బెండ్ తీసే రకం

ఏపీ రాజకీయ పరిణామాలపై యువ వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ స్పందించారు. ఇటీవల సీఎం జగన్‌ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మందలించారన్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవాలు లేవని తెలిపారు. సీఎం జగన్ ఎవరి ముందు బెండ్ అయ్యే రకం కాదని బెండ్ తీసే రకం అని అన్నారు.
 
కొందరు తమలాగే అందరూ బెండ్ అవుతారని అనుకుంటారని అన్నారు. పెద్దల వద్ద బెండ్ అవ్వడం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు, ఆయన తనయుడు నారా లోకేశ్‌కు అలవాటు అని అన్నారు. పసుపు రంగు బ్యాచ్‌కు దరిద్రం పట్టిందని వాళ్లకు జరిగిన అవమానాలే ఎదుటి వాళ్లకి కూడా జరగాలని అనుకుంటున్నారని విమర్శించారు.
 
పట్టాభి, సబ్బం హరి  అసలు లెక్కలోనే లేకపోతే వాళ్లపై ప్రత్యేకంగా దాడి చేసేదెవరు? అసలు రాష్ట్రంలో వాళ్లిద్దర్ని పట్టించుకునే వాళ్లు వున్నారా అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.