శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 4 ఏప్రియల్ 2019 (12:23 IST)

ఎవరీ మోహన్ బాబు.. ఎవరీ జయసుధ.. ఎవరీ అలీ..? చంద్రబాబు

వైకాపాలో చేరిన సినిమా తారలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎవరీ మోహన్ బాబు, ఎవరీ జయసుధ.. ఎవరీ అలీ.. ఈ మనుషులంతా ఎవరు? అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఉన్నారు మీరు అక్కడ ఉండండి. కేసీఆర్‌కి ఊడిగం చేస్తున్నారు చేసుకోండి. ఇక్కడకు వచ్చి మీ పెత్తనం ఏంటి? అంటూ ఫైర్ అయ్యారు.  
 
"ఏపీ కష్టకాలంలో వున్నప్పుడు స్పందించని మీరు.. ఇప్పుడు వైకాపాకు సపోర్ట్ చేస్తారా..? తిత్లీ, హుద్‌హుద్ తుఫాన్లకు వచ్చారా మీరు. కరువు ఉంటే ఏనాడైనా వచ్చారా? జనం నీరు లేక అల్లాడిపోతుంటే నేను నీళ్లు తీసుకువచ్చా. ఈ రోజు మేం కష్టపడి నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తుంటే మీరొచ్చి పెత్తనం చేస్తారా? ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండండి. 
 
మీవల్ల అయితే పనిచేయండి. కావాలంటే కేసీఆర్‌కి ఊడిగం చేసుకోండి. బాంచన్.. నీ కాళ్లు మొక్కుతా అని ఆ నీళ్లు నెత్తిపై జల్లుకోండి. మీ ఆటలు నా దగ్గర మీ ఆటలు సాగవు అని హెచ్చరిస్తున్నా'' అంటూ వైసీపీలో చేరిన సినీతారలకు బాబు హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికలు వచ్చే సరికి ఏపీకి చాలా వలస పక్షులు హైదరాబాద్ నుంచి వచ్చాయని చంద్రబాబు ఎద్దేవా చేశారు.