నెల్లూరు జిల్లాలో రైల్వే కంటోన్మెంట్గా పేరు గడించిన బిట్రగుంటలో కాంక్రీట్ స్లీపర్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ని కానీ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ మెయింటినెన్స్ సెంటరును కానీ క్యారేజ్ అండ్ వ్యాగన్ వర్క్షాపును కానీ ఏర్పాటు చేయమని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి లోక్సభలో శుక్రవారం విజ్ఞప్తి చేశారు. శూన్యగంటలో ఆయన మాట్లాడుతూ గతంలో రైల్వే మంత్రిగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్ బిట్రగుంటలో కాంక్రీట్ స్లీపర్ మానుఫాక్చరింగ్ యూనిట్ను...