బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 మార్చి 2022 (11:36 IST)

సీఎం జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించిన ఎస్తేర్ డుఫ్లో

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నోబెల్ బహుమతి గ్రహీత్ ఎస్తేర్ డుఫ్లో ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక కార్యక్రమాలు, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, మహిళా సాధికారత తదితర రంగాల్లో చేపట్టిన పలు వినూత్న కార్యక్రమాలు, పథకాలు అమలు తీరును ఎస్తేర్ బృందానికి వివరించారు.
 
కాగా, పేదల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలు సుత్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యాలు, ముఖ్యంగా, పేదరిక నిర్మూలన కోసం తీసుకుంటున్న చర్యలను నోబెల్ బహుమతి విజేత కొనియాడారు. 
 
ఎస్తేర్ డుఫ్లో సారథ్యంలోని (ఫ్రెంచ్ అమెరికన్ ఆర్థివేత్త) బృందం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఎస్తేర్ ప్రశంసల వర్షం కురిపించారు.