1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Pawan Kalyan files nomination papers in Pithapuram

పిఠాపురంలో పవన్ కల్యాణ్ నామినేషన్ దాఖలు.. ఆవిడ వద్ద ఆశీర్వాదం

pawan kalyan
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రాజకీయ నాయకుడిగా మారిన నటుడు పవన్ కళ్యాణ్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేబ్రోలులోని తన నివాసం నుంచి భారీ ర్యాలీగా పిఠాపురం చేరుకుని పిఠాపురంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్‌ఓ) కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ ర్యాలీలో పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 
 
పార్టీ జెండాలు పట్టుకుని మోటారు సైకిళ్లు, కార్లతో ర్యాలీ దారి పొడవునా మద్దతుదారులు పవన్ కల్యాణ్‌కు స్వాగతం పలికారు. జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు. జై జన సేన.. అంటూ ర్యాలీలో ప్రతిధ్వనించారు. పిఠాపురం, దాని పరిసర ప్రాంతాలలోని ప్రధాన కూడళ్ల మీదుగా సాగిన ర్యాలీ పవన్ కళ్యాణ్ నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి వీలుగా పాదగయ కేష్త్రం వద్ద ముగిసింది.
 
అంతకుముందు.. నామినేషన్‌కు వెళ్లేందుకు పవన్ కల్యాణ్ ఆ క్రిస్టియన్ మహిళ ఆశీర్వాదం తీసుకున్నారు. పవన్ కోసం ప్రార్థన చేసి భారీ మెజారిటీతో గెలవాలని ఆశీర్వదించిన క్రిస్టియన్ మహిళ, పెద్దావిడ కాళ్ళకు నమస్కరించి పవన్ కల్యాణ్ ఆశీర్వాదం తీసుకున్నారు.
తర్వాతి కథనం
Pawan Kalyan నామినేషన్: ఆంధ్రప్రదేశ్‌కి నువ్వు కావాలి, అందుకోసం నా ప్రాణం ఇవ్వమన్నా ఇస్తా