1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 మార్చి 2022 (22:13 IST)

వైకాపా అనే మహిషానికి కొమ్ములు విరగ్గొడతాం - మాటల తూటాలు పేల్చిన పవన్ కళ్యాణ్

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఇప్పటంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభ జరిగింది. ఇందులో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అదిరిపోయే ప్రసంగం చేశారు. వైకాపా నేతలను, పాలకులను లక్ష్యంగా చేసుకుని మాటల తూటాలు పేల్చారు. జనసేన పార్టీ  పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాల్లో ఇదే హైలెట్ అని ఇప్పుడో సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 
 
"అధికార మదంతో ఒళ్లు బలికి కొట్టుకుంటున్న వైకాపా అనబడే మహిషానికి కొమ్ములు విరగ్గొట్టి కింద కూర్చోబెట్టి వచ్చే ఎన్నికల్లో సరికొత్త ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిద్దాం. ఇదే జనసేన పార్టీ 9న ఆవిర్భావ సభ యొక్క లక్ష్యం. ఉద్దేశం" అని ప్రకటించారు. 
 
అంతేకాకుండా "కూల్చేవాడుంటే కట్టేవాడుంటాడు. విడదీసేవాడుంటే కలిపేవాడుంటాడు. చీకట్లో తోసేవాడుంటే వెలుగులోకి లాక్కొచ్చేవాడుంటాడు. తలెగెరేసే పాలకుడుంటే ఎగిరి తన్నే పరశురాముడు ఉంటాడు. దోపిడీ చేసే వైసీపీ గూండాగాళ్లు ఉంటే వారి దోపిడీని అడ్డుకునే జనసైనికులు ఉంటారు. వైకాపాది విధ్వంసం.. జనసేనది వికాసం. వారిది ఆధిపత్యం మనది ఆత్మగౌరవం. అది అహంకారానికి అడ్డా.. ఇది జనసైనికుల గడ్డ.. జై జనసేన" అంటూ పవన్ కళ్యాణ్ ప్రసంగం ముగించారు.