సంబంధిత వార్తలు
- ద్యావుడా.. శ్రీరెడ్డి గురించి మాట్లాడాలా? పరుగులు తీసిన బ్రహ్మానందం...
- పవన్పై కుట్రకు సంబంధించి.. నాకు చాలా నిజాలు తెలుసు: మాధవీలత
- పవన్ కళ్యాణ్ "ఖుషి"కి 17 యేళ్లు (Trailer)
- పవనూ ట్వీట్లు చేస్తూ కూర్చోవడం వల్ల పైసా ప్రయోజనం వుండదు: శ్రీధర్
- అల్లు అరవింద్కి దిమ్మతిరిగే సమాధానంతో షాక్ ఇచ్చిన సినీ పెద్దలు...
కర్ణాటక ఎన్నికలు : జేడీఎస్ తరపున పవన్ ప్రచారం
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 12వ తేదీన జరుగనుంది. ఈ ఎన్నికల కోసం ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ప్రచార బరిలో హేమాహెమీలు ఉన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 12వ తేదీన జరుగనుంది. ఈ ఎన్నికల కోసం ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ప్రచార బరిలో హేమాహెమీలు ఉన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఇటు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు అటు బీజేపీ, జేడీఎస్లు పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పోటీలో ఉన్న జేడీఎస్ తరపున జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. ఈ విషయాన్ని జేడీఎస్ అధ్యక్షుడు కుమార స్వామి వెల్లడించారు.
ఉత్తర కర్ణాటక ప్రాంతం తెలంగాణలోని హైదరాబాద్, మహబూబ్నగర్ జిల్లాలకు.. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, కర్నూలు జిల్లాలకు అనుబంధంగా ఉన్న నేపథ్యంలో పవన్తో ఇక్కడ ప్రచారం చేయిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో కనీసం 18 స్థానాలు గెలవడమే లక్ష్యమన్నారు. ఇప్పటికే స్టార్ క్యాంపెయినర్లుగా 'జాగ్వార్' హీరో నిఖిల్, హీరోయిన్ పూజాగాంధీ పేర్లు ప్రకటించామని, వారు ఉత్తర కర్ణాటకలో ప్రచారం చేస్తారని కుమారస్వామి వివరించారు.
