1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Pawan Kalyan to campaign for JD(S)

కర్ణాటక ఎన్నికలు : జేడీఎస్ తరపున పవన్ ప్రచారం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 12వ తేదీన జరుగనుంది. ఈ ఎన్నికల కోసం ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ప్రచార బరిలో హేమాహెమీలు ఉన్నారు.

Pawan Kalyan
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 12వ తేదీన జరుగనుంది. ఈ ఎన్నికల కోసం ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ప్రచార బరిలో హేమాహెమీలు ఉన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఇటు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు అటు బీజేపీ, జేడీఎస్‌లు పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పోటీలో ఉన్న జేడీఎస్ తరపున జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. ఈ విషయాన్ని జేడీఎస్ అధ్యక్షుడు కుమార స్వామి వెల్లడించారు.
 
ఉత్తర కర్ణాటక ప్రాంతం తెలంగాణలోని హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు.. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కర్నూలు జిల్లాలకు అనుబంధంగా ఉన్న నేపథ్యంలో పవన్‌తో ఇక్కడ ప్రచారం చేయిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో కనీసం 18 స్థానాలు గెలవడమే లక్ష్యమన్నారు. ఇప్పటికే స్టార్‌ క్యాంపెయినర్‌లుగా 'జాగ్వార్‌' హీరో నిఖిల్‌, హీరోయిన్‌ పూజాగాంధీ పేర్లు ప్రకటించామని, వారు ఉత్తర కర్ణాటకలో ప్రచారం చేస్తారని కుమారస్వామి వివరించారు. 
About Writer
pnr
తర్వాతి కథనం
స్టైల్ స్టైల్.. రజనీకాంత్ ఫోటోస్ అదుర్స్.. సోషల్ మీడియాలో వైరల్