సంబంధిత వార్తలు
- హర్యానాలోని కర్నాల్లో పాఠశాలలో 54 మందికి కరోనా పాజిటివ్
- కోడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కోడిపుంజు కూతలతో చెవుల్లో దూది..?
- బోర్డుపై పాఠాలు చెపుతున్న మహిళా టీచర్ను విద్యార్థుల ముందే కత్తితో పొడిచేసిన భర్త
- బైడెన్ ఆదేశాలు.. వైమానిక దాడులు 17మంది ఇరాన్ ఫైటర్లు మృతి
- ముంబై హాస్టల్లో 200 మందికి కరోనా.. రికార్డు స్థాయిలో కొత్త కేసులు
పబ్జి గేమ్తో రెండు గ్రామాల మధ్య గొడవ.. కర్రలతో కొట్టుకుంటున్నారట!
భారతదేశంలో పబ్జి గేమ్ బ్యాన్ చేసినా సరే చాలా మంది వివిధ రకాల టెక్నాలజీలు ఉపయోగించి పబ్జి గేమ్ ఆడుతూనే ఉన్నారు. ఇప్పుడు సదరు పబ్జి గేమ్ కృష్ణా జిల్లాలో రెండు గ్రామాల మధ్య ఘర్షణకు కారణమైంది. కృష్ణా జిల్లా నూజివీడులో ఈ పబ్జి వలన ఘర్షణ చోటు చేసుకుంది. రెండు గ్రామాలకు చెందిన విద్యార్థులు బస్సులో ఘర్షణకు దిగినట్లు చెబుతున్నారు.
ఈ ఘర్షణ పెద్దది కావడంతో రెండు గ్రామాల మధ్య ఘర్షణగా మారిందని చెబుతున్నారు. కృష్ణా జిల్లాలోని కొత్తూరు తండా అలాగే సిద్ధార్థ నగర్ గ్రామాల మధ్య ఈ వివాదం మొదలైంది. కర్రలు రాళ్లతో పరస్పరం రెండు గ్రామాల మధ్య దాడులు జరిగినట్లు తెలుస్తోంది. పబ్జి ఆడే సమయంలో ఒకరినొకరు దూషించుకున్న కారణంగా ఈ వివాదం మొదలైంది అని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
