శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (10:23 IST)

బైడెన్ ఆదేశాలు.. వైమానిక దాడులు 17మంది ఇరాన్ ఫైటర్లు మృతి

సిరియాలోని కొన్ని స్థావరాలపై ఇవాళ అమెరికా దళాలు వైమానిక దాడులు చేశాయి. ఆ రాకెట్ దాడుల్లో సుమారు 17 మంది ఇరాన్ ఫైటర్లు మృతిచెందారు. ఇరాన్ మద్దతు ఇచ్చే మిలిటెంట్ల స్థావరాలపై దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల ఇరాక్‌లోని అమెరికా దళాలపై మూడు వేర్వేరు రాకెట్ దాడులు జరిగాయి. దానికి ప్రతీకారంగా అమెరికా తాజా రాకెట్ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. 
 
అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన ఆదేశాలతోనే ఇరాన్‌ మిలిటెంట్లపై దాడులు జరిగాయి. ఇటీవల ఇరాక్‌లోని ఇర్బిల్‌లో జరిగిన దాడికి షియా మిలిటెంట్లు కారణమని అమెరికా అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా రక్షణ కార్యాలయంలో పెంటగాన్ ఈ తాజా దాడులకు పూనుకున్నది. 
 
సిరియా-ఇరాక్ బోర్డర్‌లో మిలిటెంట్ల ఆధీనంలో ఉన్న ప్రాంతంపై దాడులు చేసినట్లు పెంటటాన్ అధికారులు తెలిపారు. అధ్యక్షుడు బైడెన్ ఆదేశాల ప్రకారం ఈస్ట్రన్ సిరియాలోని స్థావరాలపై దాడి చేసినట్లు పెంటగాన్ ప్రతినిధి జాన్ కిర్బీ వెల్లడించారు.