1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 మే 2022 (19:05 IST)

క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్‌.. ఇదే మా నినాదం.. చంద్రబాబు

క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్‌.. ఇదే మన నినాదం అన్నారు.. క్విట్ ఇండియా ఉద్యమం లాగే ఈ ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు.. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. అన్నవరంలో తుని, ప్రత్తిపాడు టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ..  పోలవరం ప్రాజెక్టు పనులు తమ హయాంలోనే 70 శాతం పూర్తి చేశామని తెలిపారు.
 
చంద్రబాబు.. కొర్రీలు పెట్టడంతో పోలవరంపై కేంద్ర సర్కార్‌ వెనక్కి వెళ్లిపోయిందన్న ఆయన.. పోలవరం డయాగ్రామ్ వాల్ కొట్టుకుపోవడానికి నేను కారణం అంటున్నారు.. భార్య భర్తలు విడిపోయినా నేనే కారణం అంటారు ఏమో? అంటూ సెటైర్లు వేశారు చంద్రబాబు. పదో తరగతి పరీక్షలు నిర్వహించని సీఎం వైఎస్‌ జగన్‌.. ఇక మూడు రాజధానులు ఎలా కడతారు..? అంటూ ఎద్దేవా చేశారు చంద్రబాబు.