1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

విశాఖ నుంచి వెళ్లే పలు రైళ్లు రద్దు .. ఎందుకో తెలుసా?

train
విశాఖపట్టణం రైల్వే స్టేషన్ నుంచి వెళ్లే అనేక రైళ్ళు రద్దు అయ్యాయి. సౌత్ ఈస్ట్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ పరిధిలో ఆధునకీకరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రైళ్లను రద్దు చేశారు. ఈ విషయాన్ని వాల్తేరు డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. మరికొన్ని రైళ్ల గమ్యస్థానాలను కుదించినట్టు వెల్లడించారు. అలాగే, ఇంకొన్ని రైళ్లు ఆలస్యంగా బయలుదేరుతాయని తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని ఆయన కోరారు. 
 
ప్రస్తుతం రద్దు చేసిన రైళ్లను పరిశీలిస్తే, ఈ నెల 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు విశాఖ రాయపూర్, 7 నుంచి 13వ వరకు రాయపూర్ విశాఖ రైళ్లను మహాసముండ - రాయపూర్ - మహాసముండ స్టేషన్ల మధ్య రద్దు చేసినట్టు తెపారు. 
 
అలాగే ఈ నెల 11వ తేదీన విశాఖ - కోర్బా, 12న కోర్బా-విశాఖ రైలును, 6 నుంచి 12వ తేదీ వరకు విశాఖ - దుర్గ్, 7 నుంచి 13 వరకు దుర్గ్ - విశాఖ రైళ్లను కూడా రద్దు చేసినట్టు ఆయన తెలిపారు. 
 
దారి మళ్లించిన రైళ్లలో తిరుపతి - బిలాస్‌పూర్ మధ్య నడిచే రైలు ఈ నెల 8, 11 తేదీల్లో, బిలాస్‌పూర్ - తిరుపతి మధ్య నడిచే రైలును 10, 13 తేదీల్లో పూరీ అహ్మదాబాద్ రైలును 6,8,9,10,13,15 తేదీల్లో, అహ్మదాబాద్ - పూరీల మధ్య నడిచే రైలును 8, 10, 11, 12, 15 తేదీల్లో టిట్లాఘర్, సంబల్‌పూర్, జూర్సుగూడ ప్రాంతాల మీదుగా దారి మళ్లించినట్టు తెలిపారు. 
 
ఆలస్యంగా బయలుదేరే రైళ్లలో విశాఖ - కోర్బా రైలు ఈ నెల 12వ తేదీన 5 గంటలకు విశాఖ - నిజాముద్దీన్ సమతా ఎక్స్‌ప్రెస్ 8, 15 తేదీల్లో 2 గంటలకు, హజ్రత్ నిజాముద్దీన్ - విశాఖ సమతా ఎక్స్‌ప్రెస్ 12న 5 గంటలకు, తిరుపతి - బిలాస్‌పూర్ రైలు 15న 4 గంటలకు, విశాఖ - భగత్ కీ కోఠి రైలు ఆస్యంగా బయలుదేరుతాయని ఆయన తెలిపారు.