1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. South Central Railway Restores 13 DEMO Trains

13 రైళ్లను మళ్లీ పట్టాలెక్కిస్తున్న దక్షిణ మధ్య రైల్వే

train
దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల వివిధ కారణాల రీత్యా పలు రైళ్లను రద్దు చేసింది. ఈ రైళ్లలో 13 రైళ్లను తిరిగి పట్టాలెక్కించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు 13 డెమో రైళ్ళను పునరుద్ధరిస్తూ టైం టేబుల్‌ను ఖరారు చేసింది. 
 
వీటిలో విజయవాడ - గూడూరు, గూడూరు - విజయవాడ, నిజామాబాద్ - నాందేడ్, నాందేడ్ - విజయవాడ, తెనాలి - విజయవాడ, విజయవాడ - తెనాలి, కర్నూలు సిటీ - నంద్యాల, నంద్యాల - కర్నూలు సిటీ, గుంటూరు - విజయవాడ, విజయవాడ - గుంటూరు, విజయవాడ - ఒంగోలు, ఒంగోలు - విజయవాడల మధ్య నడిచే డెమో రైళ్ళను తిరిగి నడిపేందుకు చర్యలు తీసుకుంది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
హోటల్స్ - రెస్టారెంట్లలో సర్వీస్ చార్జ్ బాదుడు నుంచి రిలీఫ్