1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 మార్చి 2022 (19:22 IST)

పట్టాలెక్కనున్న ప్యాసింజర్ రైళ్లు..

కరోనా కారణంగా రద్దయిన ప్యాసింజర్ రైళ్లు, డెమో రైళ్లు తిరిగి పట్టాలెక్కనున్నాయి. ఈ నెల 27, 28, 29వ తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 23 రైళ్లను పునరుద్ధరించనున్నట్లు స్పష్టం చేసింది. 
 
ఇందులో 8 ప్యాసింజర్ రైళ్లు కాగా.. 15 డెమో రైళ్లు ఉన్నాయి. ఇక వాటిల్లో ప్రస్తుతం 23 రైళ్లను పునరుద్దరిస్తోంది.  
 
ఈ నెల 27, 28,29 తేదీల్లో పట్టాలెక్కనున్న ప్యాసింజర్ రైళ్లు ఇవే..
నడికుడి – మాచర్ల – నడికుడి(67279-80),
గుంటూరు – తెనాలి – రేపల్లి(67209-10) ప్యాసింజర్ రైళ్లు ఈ నెల 28న పట్టాలెక్కనుండగా.. 
కాచిగూడ – మేడ్చల్ – కాచిగూడ(57307-08) మార్చి 27వ తేదీన, 
నరసాపురం – భీమవరం – నరసాపురం(17264-63) మార్చి 28న ప్రారంభం కానున్నాయి.